చాలా లక్కీగా బాహుబలి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్జోహార్. ఈ సినిమాకు బాలీవుడ్లో హైప్ తీసుకువచ్చేందుకు ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాతలే కరణ్ను అప్రోచ్ అయ్యారు. వాస్తవానికి బాహుబలి 1 సినిమాను ముందుగా బాలీవుడ్లో రిలీజ్ చేసేముందు చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్కడ ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం, ఆ తర్వాత బాహుబలి 2కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్తో కరణ్కు దిమ్మతిరిగిపోయింది.
బాహుబలి 2 అక్కడ ఏకంగా బాలీవుడ్ సినిమాల దిమ్మతిరిగి పోయేలా రూ.500 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడంతో కరణ్కు బాహుబలి 2తో మామూలు లాభాలు రాలేదు. ఇక కరణ్ కూడా బాహుబలి 2కు నార్త్లో తిరుగులేని హైప్ రావడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో కరణ్ ఇప్పుడు సౌత్ ఇండియన్ క్రేజీ ప్రాజెక్టులపై కన్నేస్తున్నారు.
సూపర్స్టార్ మహేష్బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమాను బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు కరణ్ చాలా ఇంటస్ట్ర్తో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్ టీజర్కు దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్పైడర్ టీజర్ కోటి వ్యూస్కు దగ్గరైంది.
స్పైడర్ సినిమాకు కూడా భారీ హైప్ తీసుకువచ్చి అక్కడ రిలీజ్ చేయాలని కరణ్ ప్లాన్స్ చేస్తున్నారట. కరణ్తో స్పైడర్ నిర్మాతల డీల్ సెట్ అయితే ఈ సినిమాను తెలుగు, తమిళ్, మళయాళంతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి.
మురుగదాస్కు బాలీవుడ్లోను క్రేజ్ ఉంది. ఇప్పుడు స్పైడర్కు సౌత్ మార్కెట్కు తోడు నార్త్ మార్కెట్ కూడా తోడై సినిమా హిట్ అయితే స్పైడర్ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయం.