తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ వాణి బలంగానే వినిపిస్తున్నారు. ఓ లేడీ అయ్యి ఉండి తెలంగాణ ఎదుర్కొంటోన్న సమస్యలపై ఆమె లోక్సభలో తన వాగ్దాటిని బలంగానే వినిపిస్తున్నారన్న చర్చలు కూడా టీ పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని దాదాపు యేడాది కాలంగా ఒక్కటే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుందని…మోడీ టీఆర్ఎస్కు రెండు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారని..అందులో ఒకటి కవితకేనన్న ప్రచారం ఓ రేంజ్లో జరిగింది.
అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరకపోవడంతో కవిత మంత్రి పదవి ఆశలు తీరేలా లేవు. మరో షాక్ ఏంటంటే మోడీ ఈ నెల 28న కేంద్ర మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఈ లోగా టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరడం, కవిత మంత్రి అవ్వడం జరగని పని. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో కవిత ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
2019లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి స్టేట్ కేబినెట్లో మంత్రి అయ్యేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్తో వెళుతున్నట్టు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మంత్రి పదవి నిర్వహించాలన్న కోరిక ఎంపీ కవిత బలంగా ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికిప్పుడు కాకపోయినా 2019లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి పదవి తీసుకోవాలని భావిస్తున్నారట.
2019 ఎన్నికల తర్వాత కేసీఆర్ సీఎం బాధ్యతలు కేటీఆర్కు అప్పగిస్తారని…కేటీఆర్ కేబినెట్లో మంత్రి అవ్వాలని కవిత బలంగా నిర్ణయించుకున్నారట. 2019లో ఆమె జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు పక్కా ప్లానింగ్తో ఉన్నట్టు కూడా టీఆర్ఎస్ వర్గాలే చెపుతున్నాయి. ఇటీవల కవిత జగిత్యాలపై ప్రత్యేకంగా కాన్సంట్రేషన్ చేస్తున్నారు. అక్కడ పెండింగ్లో ఉన్న చాలా సమస్యలు పరిష్కరిస్తున్నారు.
అక్కడ సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను మంత్రి హరీష్రావుతో మాట్లాడి పరిష్కరించారు. జగిత్యాల మామిడి ఎగుమతులకు ప్రసిద్ధి. అందుకే జగిత్యాల మామిడికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు. జగిత్యాల ఆమె ఎంపీ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసేందుకు ఇబ్బంది కూడా ఉండదన్న ప్లానింగ్తోనే ఆమె జగిత్యాలపై కాన్సంట్రేషన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి కవిత మంత్రి పదవి ఆశలు ఎలా ? ఎప్పటకి ? నెరవేరతాయో చూడాలి.