దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ‘మహానుభావుడు’ రంగంలోకి దిగింది. ఓ వైపు ఎన్టీఆర్ జై లవకుశ, మరో వైపు మహేష్బాబు స్పైడర్ సినిమాలు ఉండగానే యూవీ క్రియేషన్స్ వాళ్లు తమ సినిమాలో కంటెంట్పై ఉన్న కాన్ఫిడెన్స్తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. శర్వానంద్ గతంలో కూడా పండగల సీజన్లో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టడంతో మహానుభావుడు విషయంలో ఎక్కడా బ్యాక్స్టెప్ తీసుకోలేదు.
కట్ చేస్తే జై లవకుశ, స్పైడర్ సినిమాలపై మహానుభావుడు పైచేయి సాధించి అందరికి దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చింది. మహానుభావుడు సినిమాకు ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ రావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఫస్ట్ వీక్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ 32.2 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
సక్సెస్ ఫుల్గా సెకండ్ వీక్లోకి ఎంటర్ అయిన మహానుభావుడు ఈ వీక్ ఎండింగ్కే రూ.50 కోట్ల మార్క్ టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. శర్వానంద్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలవడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై గతంలో ‘రన్ రాజా రన్’ .. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చేసిన శర్వానంద్, ‘మహానుభావుడు’తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మెహ్రీన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ బాగా కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.