మ‌హేష్ 25వ మూవీ మ‌ల్టీస్టార‌ర్‌గా ఫిక్స్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న (వ‌ర్కింగ్ టైటిల్ స్పైడ‌ర్‌) మ‌హేష్ ఈ సినిమా త‌ర్వాత తాను న‌టించే 24, 25 ప్రాజెక్టుల‌ను కూడా లైన్లో పెట్టేశాడు. మురుగ‌దాస్ సినిమా త‌ర్వాత మ‌హేష్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో న‌టిస్తాడు.

భ‌ర‌త్ త‌ర్వాత మ‌హేష్ కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కే 25వ సినిమాలో న‌టిస్తాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మించే ఈ ప్రాజెక్టుకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమానే మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తెర‌కెక్కుతుంద‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారాయి.

మ‌హేష్ ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాలో న‌టించిన మ‌హేష్ ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాకు కామెడీ కింగ్ అల్ల‌రి న‌రేష్‌తో క‌లిసి న‌టించ‌నున్నాడ‌ట‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి మ‌హేష్ – అల్ల‌రి న‌రేష్ స్క్రీన్ షేరింగ్‌ను వంశీ పైడిప‌ల్లి ఎంత రంజుగా మారుస్తాడో చూడాలి.