టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు ఓ టాప్ ప్రొడ్యుసర్ను నిండా ముంచేశాడు. తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకడు. రాజు సినిమా తీసినా, పంపిణీ చేసినా చాలా లెక్కలు ఫాలో అవుతాడు. రాజు సినిమాల్లో చాలా సినిమాలు ప్లాప్ అయినా కూడా డబ్బులు మాత్రం పోలేదు. ఇక ఇటీవల రాజు నిర్మాతగా వరుస హిట్లు కొడుతున్నాడు.
రాజు ఈ యేడాది తీసిన డీజే సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగానే ఉన్నాయి.
ఈ క్రమంలోనే రాజు మహేష్బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమాను నైజాంలో పంపణీ చేశాడు. మహేష్బాబు – మురుగదాస్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాను ఏకంగా రూ.25 కోట్లకు సొంతం చేసుకున్నాడు. మనకు వినపడుతోన్న టాక్ ప్రకారం స్పైడర్ను నాన్ రిఫండబుల్ (నష్టపోయినా సొమ్ముకు గ్యారెంటీ లేకపోవడం) పద్ధతిలో పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు అనూహ్యంగా డ్రాప్ అవుతున్నాయి. నైజాంలో స్పైడర్ తొలి రోజు రూ 4.7 కోట్లు తెచ్చుకోగా మొత్తం 6 రోజులకి 9 కోట్లు షేర్ క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. సినిమా ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, మరోవైపు జై లవకుశ ఇప్పటకీ స్పైడర్కు పోటీగా వసూళ్లు రాబట్టడం, మహానుభావుడు బాగా క్లిక్ అవ్వడంతో స్పైడర్ వసూళ్లు బాగా డల్ అయ్యాయి.
ఇక నైజాంలో స్పైడర్ వసూళ్లు లాంగ్ రన్లో కూడా రూ.12 కోట్లకు మించి వచ్చే ఛాన్సులు లేవు. ఈ లెక్కన సగానికి సగంపైగా రాజుకు నష్టాలు తప్పేలా లేవు. స్పైడర్ సినిమా దిల్ రాజుకి భారీ నష్టాలు అందించి కోలుకోలేని స్థాయిలో దెబ్బ కొట్టింది అని చెప్పాలి. మహేశ్- మురుగదాస్ కాంబినేషన్ మీద నమ్మకంతో దిల్ రాజు భారీ పెట్టుబడి పెట్టి నిండా మునిగిపోయాడు.