సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఓవర్సీస్లో అంతకుమించిన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ అట్టర్ ప్లాప్ అయిన వన్-నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం సినిమాలు అక్కడ అవలీలగా మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఈ ఒక్క ఉదాహరణే ఓవర్సీస్లో మహేష్ సినిమాల దూకుడు ఎలా ఉంటుందో చెపుతోంది.
తాజాగా రిలీజ్ అయిన మహేష్ స్పైడర్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇక్కడ నాలుగు రోజులకు రూ.26 కోట్ల షేర్ రాబడితే ఓవర్సీస్లో దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ప్రీమియర్లతోనే మిలియన్ మార్క్ డాలర్లను టచ్ చేసి అందరికి దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చిన స్పైడర్ నాలుగురోజులకే ఒకటిన్నర మిలియన్ కు చేరువైంది.
ఆదివారంతో ఈ సినిమా వసూళ్లు 1.5 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేశాయి. దీంతో మహేష్కు ఓవర్సీస్లో ఎలాంటి క్రేజ్ ఉందో మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాను అన్ని ఏరియాల్లో భారీ రేట్లకు అమ్మడంతో ఆ మేరకు రికవరీ రావాలంటే స్పైడర్ రెండో వీక్లోను స్టడీగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేసియాన్ ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇక స్పైడర్ తమిళ్ వెర్షన్ హిట్ టాక్తో స్టడీగా వసూళ్లు రాబడుతోంది.