డీజే ఫేక్ క‌లెక్ష‌న్స్‌పై మెగాస్టార్ ఫ్యాన్స్ ఎటాక్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే భారీ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా కంటెంట్ ప‌రంగా తేలిపోవ‌డంతో త‌ర్వాత రిపీటెడ్ ఆడియెన్స్ లేక యావ‌రేజ్‌గా నిల‌బ‌డింది. అయితే డీజే టీం ముందు నుంచి పెద్ద ఎత్తున ప్ర‌మోష‌న్లు చేసి ఈ సినిమాకు క‌లెక్ష‌న్లు చాలా ఎక్కువ‌ని లెక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే విష‌యంపై టాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చ కూడా జ‌రిగింది.

డీజే టీం లెక్క‌ల ప్ర‌కారం ఈ సినిమా ఫ‌స్ట్ వీక్‌కే ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింద‌ని చెప్పారు. అయితే వాస్త‌వంగా ఈ సినిమాకు ఆ రేంజ్‌లో వ‌సూళ్లు రాలేద‌ని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న టాక్‌. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ అయితే డీజే సినిమా నైజాంలో రూ.20 కోట్లు కొల్ల‌గొట్టింద‌ని, ఇది త‌ప్ప‌ని ఎవ‌రైనా నిరూపించ‌వ‌చ్చ‌ని ఏకంగా ఓపెన్ స‌వాల్ చేశాడు.

ఇదిలా ఉంటే బ‌న్నీకి కొద్ది రోజులుగా అటు ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే డీజే టీం మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 వ‌సూళ్ల‌ను దాటేసిందంటూ ఓ టాక్ డీజే వ‌ర్గాల ద్వారా ట్రెండ్ అవుతోంది. దీనిపై చిర్రెత్తుకొచ్చిన మెగాస్టార్ ఫ్యాన్స్ ‘డీజే’ ఆఫీసుపై దాడి చేశారు. డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు.

ఇక ఈ విష‌యం తెలుసుకున్న డీజే నిర్మాత దిల్ రాజు మెగా ఫ్యాన్స్‌ను శాంతింప‌జేసేందుకు నానా పాట్లు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే ఈ ఇష్యూ ఇక్క‌డితో ఆగేలా లేదు. ఫ్యూచ‌ర్‌లో సైతం బన్నీకి మెగా హీరోల‌కు, మెగా అభిమానుల‌కు పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా క‌నిపిస్తోంది.