మెగా ఫ్యాన్స్ చూపు మ‌హేష్ వైపు..అస‌లేం జ‌రిగింది

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మెగా ఫ్యామిలీ హీరోలంద‌రికి మెగా ఫ్యాన్స్ ఎంతో స‌పోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే యేడాదిలో ఏకంగా 10కి పైగా రిలీజ్ అవుతుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు వైపు ప‌డింది. అదేంట‌ని షాక్ అవ్వొద్దు.

ఇది నిజ‌మే… మెగా ఫ్యాన్స్ అంద‌రూ మ‌హేశ్ బాబు వైపు చూస్తున్నారు. దీని వెన‌క అస‌లు క‌థేంటంటే మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం న‌టించిన స్పైడ‌ర్ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ అవుతోంది. ద‌స‌రా బ‌రిలో మెగా ఫ్యామిలీ హీరోలు న‌టించిన సినిమా ఏదీ రిలీజ్ కావ‌డం లేదు. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సెప్టెంబ‌ర్ 21న వ‌స్తుంటే, 27న స్పైడ‌ర్ రిలీజ్ అవుతోంది. ఇక ద‌సరాకే రావాల్సిన బాల‌య్య పైసా వ‌సూల్ సినిమా సెప్టెంబ‌ర్ 1నే వ‌చ్చేస్తోంది.

దీంతో ద‌స‌రా బ‌రిలో ఎన్టీఆర్ వ‌ర్సెస్ మ‌హేశ్ మ‌ధ్య న‌టిస్తోన్న ఈ వార్‌లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలంద‌రూ స్పైడ‌ర్‌కే ఓటు వేస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తోన్న స్పైడ‌ర్ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.