దర్శకరత్న దాసరి నారాయణరావుకు వీరాభిమాని ఎవరంటే ఆయన చెప్పే ఆన్సర్ అక్కినేని నాగేశ్వరరావు. దాసరి ఎంతోమందితో బ్లాక్బస్టర్ హిట్లు కొట్టినా ఆయనకు వన్ అండ్ ఓన్లీ వీరాభిమాని నాగేశ్వరరావే. వారిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన మేఘసందేశం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లోనే టాప్ సినిమా. ఏఎన్నార్ తర్వాత ఆయన తనయుడు నాగార్జునతోను మజ్ను లాంటి విషాదాంత ప్రేమకథ తీసి హిట్కొట్టాడు దాసరి.
అలాంటి అక్కినేని – దాసరి మధ్య ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చింది. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందన్న విషయాన్ని దాసరే స్వయంగా ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. అయితే అందుకు కారణాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. అయితే ఇప్పుడు దాసరి మృతి తర్వాత ఆయన ప్రియ శిష్యుడు మోహన్బాబు వీరిద్దరి మధ్య గ్యాప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాసరి – అక్కినేని మధ్య చిన్న అమౌంట్ వల్లే గ్యాప్ వచ్చిందన్న మోహన్బాబు ఆ తర్వాత ఇద్దరిని కలుపుదాం అనుకున్నా సాధ్యం కాలేదన్నారు. ఏదేమైనా ఇద్దరు లెజెండ్రీ వ్యక్తుల మధ్య చిన్న మొత్తం పెద్ద గ్యాప్కు కారణమైందంటే ఆశ్చర్యమే. అందుకే అంటారు పెద్దలు డబ్బు అన్నదమ్ములు, ప్రాణ స్నేహితుల మధ్య కూడా గ్యాప్కు కారణమవుతుందని..!