టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రిన్స్ మహేశ్బాబు, మెగాపవర్స్టార్ రాంచరణ్ మధ్య ఓ బడా క్లాష్ జరుగుతోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య బడా క్లాష్ అంటే అది ఎలాంటి రణరంగంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్లాష్ వీరిద్దరి మధ్య ఏదో అంశం మీద రావడం లేదు. బాక్సాఫీస్ వేదికగా ఈ బడా క్లాష్కు రంగం సిద్ధమవుతోంది.
టాలీవుడ్లో వచ్చే సంక్రాంతి సినీ అభిమానులను అప్పుడే ఊరిస్తోంది. మహేశ్, చెర్రీ గతంలోనే సంక్రాంతికి రెండు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. 2013లో వీరు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, నాయక్ సినిమాలతో పోటీ పడ్డారు. అప్పుడు మహేశ్దే పైచేయి అయ్యింది. రెండు సినిమాలు సక్సెస్ అయినా లాంగ్రన్లో మహేశ్ ఎస్వీఎస్ సినిమాయే ఎక్కువ వసూళ్లు సాధించింది.
ఇక ఆ మరుసటి యేడాది సంక్రాంతికే మహేశ్ వన్ – నేనొక్కడినే, చెర్రీ ఎవడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వన్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కితే, ఎవడు కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత సంక్రాంతికి కాకపోయినా వీరు నటించిన ఆగడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు పది రోజుల తేడాలో రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఆగడు ప్లాప్ అయితే గోవిందుడు బిలో యావరేజ్ అయ్యింది.
ఇప్పుడు ఈ స్టార్ హీరోలు ఇద్దరు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి సై అంటున్నారు వచ్చే సంక్రాంతికి చెర్రీ – సుకుమార్ రంగస్థలం, కొరటాల – మహేశ్ భరత్ అనే నేను రెండూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చెర్రీ పల్లెటూరి కథాంశంతో వస్తుంటే.. మహేశ్ పొలిటికల్ కథాంశంతో వస్తున్నాడు. మరి సంక్రాంతి క్లాష్లో ఎవరు విన్ అవుతారో చూడాలి.