అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు వస్తున్నా….అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. వీరి బ్రేకప్కు అందరూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేకప్ అటు నాగార్జున, అమలగాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వరూ స్పందించడం లేదు.
నాగ్ ఇటు రాజుగారి గది-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా తన కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. అఖిల్ సైతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. అటు అమలు కూడా పబ్లిక్ ఈవెంట్లకు హాజరవుతున్నా ఈ మ్యాటర్పై మాత్రం నోరు మెదపడం లేదు. అటు జీవీకే ఫ్యామిలీ సైతం దీనిపై స్పందించడం లేదు.
ఈ విషయంలో ఈ రెండు ఫ్యామిలీలు పట్టించుకోకపోయినా ఓ సెలబ్రిటీ మాత్రం అఖిల్ – శ్రియా మధ్య రాజీకోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు. మెగాస్టార్ చిరు కోడలు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన. ఉపాసన శ్రియాకు బెస్ట్ ఫ్రెండ్, ఇక జీవీకే వారు, అపోలో వాళ్లు రెడ్డి కమ్యూనిటికి చెందిన వారు. వీరి దగ్గర బంధువులు కూడా అవుతారట.
ఇక ఉపాసన అఖిల్ – శ్రియా ఎంగేజ్మెంట్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక చిరు – నాగ్ మంచి బిజినెస్ పార్ట్నర్స్. ఈ క్రమంలోనే వీరిని కలిపేందుకు, వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఉపాసన సర్వ ప్రయత్నాలు చేస్తోందట. మరి ఉపాసన రాజీ ఫార్ములా ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.