కర్ణాటకలో మహేష్కు, పూరీ జగన్నాథ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ నేరుగా తెలుగు వర్షన్ను కాకుండా, కన్నడలోనూ సినిమాను తెరకెక్కించి కన్నడ వర్షన్నే విడుదల చేస్తారట. ప్రస్తుతం మహేష్, మురుగదాస్తో ఓ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ సినిమా పూర్తయ్యాకే పూరీతో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయన్నది పోకిరి, బిజినెస్మేన్ల్ు ఇప్పటికే ఋజువు చేసేశాయి. తాజాగా ఈ ఇద్దరూ కలిసి మూడోసారి జనగణమన అనే సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
మహేష్, పూరీ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాక ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళనుంది. ఇక ఇప్పటికే పూరీ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను మొదట్నుంచీ అనుకుంటున్నట్లుగా తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాక కన్నడలోనూ ఒకేసారి తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారట. కర్ణాటకలో మహేష్కు, పూరీ జగన్నాథ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ నేరుగా తెలుగు వర్షన్ను కాకుండా, కన్నడలోనూ సినిమాను తెరకెక్కించి కన్నడ వర్షన్నే విడుదల చేస్తారట. ప్రస్తుతం మహేష్, మురుగదాస్తో ఓ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ సినిమా పూర్తయ్యాకే పూరీతో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.