కృష్ణవంశీ ‘రైతు’ వెనుక కథ

బాలకృష్ణతో కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయనున్నాడు. ఈ టైటిల్‌ ఇదివరకు దర్శకుడు తేజ చేతిలో ఉండేది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ఈ టైటిల్‌తో సినిమా చేస్తాననేవాడు తేజ. తెలుగులో పంచెకట్టుకి గ్లామర్‌ తెచ్చిన హీరో ఎవరంటే తడుముకోకుండా బాలకృష్ణ అని చెప్పవచ్చు. నందమూరి హీరోలలో ఇప్పటిదాకా కృష్ణవంశీతో సినిమా చేసింది ఎన్టీఆర్‌ మాత్రమే. బాలకృష్ణతో చెయ్యాలని రెండేళ్ళ క్రితమే కృష్ణవంశీ అనుకున్నాడు. బాలయ్య వందవ చిత్రం కూడా కృష్ణవంశీ చేతుల మీదుగానే ఉంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా క్రిష్‌ రేసులోకి వచ్చాడు. అలా 100వ సినిమా అవ్వాల్సిన కృష్ణవంశీ సినిమా బాలయ్య కెరీర్‌లో 101వ సినిమా కానుంది.

రైతుగా కనిపించి, రైతుల సమస్యల కోసం పోరాడే అద్భుతమైన పాత్రలో బాలకృష్ణ నటించబోతున్నాడట. ఇప్పటికే బాలయ్య పొలిటికల్‌ పరంగా తన నియోజక వర్గంలోని రైతు పోకడలను, వారి సమస్యలను దగ్గరుండి చూస్తున్నారు. తాజాగా రైతుల కోసం రుణ మాఫీ పత్రాలను కూడా అందించాడు తన నియోజకవర్గంలో. ఇలా లైవ్‌గానే రైతు సమస్యలను అర్ధం చేసుకుని వారికి మేలు కలిగేందుకు పాటుపడుతున్డారు బాలయ్య. ఇప్పుడు ఈ సమస్యలకు తెర రూపం కూడా ఇస్తున్నానని ఆయనే స్వయంగా అనౌన్స్‌ చేయడంతో ఇప్పటికే రైతుల నుంచి సగం సక్సెస్‌ పొందేశాడు. కేవలం రైతు సమస్యలే కాకుండా ఈ సినిమాలో పొలిటికల్‌ టచ్‌ కూడా ఉండబోతోందని సమాచారమ్‌. ఏది ఏమైనా ఒక పక్క రాజకీయాల్లో జోరుగా ఉంటూనే సినిమాల్లో కూడా మరింత జోరు ప్రదర్శిస్తున్న బాలయ్యకు జై అని తీరాల్సిందే.