టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?

2017 ఇప్ప‌టి వ‌ర‌కైతే తెలుగు ఇండ‌స్ట్రీకి బాగానే క‌లిసొచ్చింది. సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు మంచి వ‌సూళ్ల‌తో 2017ను ఘ‌నంగా ఆరంభించాయి. ఇక ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన నాని నేను లోక‌ల్ – రానా ఘాజీ కూడా అద‌ర‌హో అనిపించేశాయి. సింగం -3, య‌మ‌న్ లాంటి డ‌బ్బింగ్ సినిమాలు సైతం జ‌స్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో అస‌లైన స‌మ్మ‌ర్ ఫైటింగ్ స్టార్ట్ అవుతోంది. టాప్ హీరోలు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. వీరిలో ముందుగా ఈ నెల 24న ప‌వ‌న్ కాట‌మ‌రాయుడుగా గ‌ర్జింజ‌బోతున్నాడు. ఈ స‌మ్మ‌ర్ లో రానున్న తొలి అతిపెద్ద సినిమా ఇదే.

ఇక ఏప్రిల్ 28న ఇండియ‌న్ సినిమా జ‌నాలు మోస్ట్ ఎగ్జైటింగ్‌తో వెయిట్ చేస్తోన్న బాహుబ‌లి 2 వ‌స్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో దుమ్ము రేపుతోంది. బాహుబ‌లి 2 వ‌చ్చిన రెండు వారాల‌కే నిఖిల్ కేశ‌వ అంటూ మే 12న వ‌స్తున్నాడు. ఇక మే 19న అల్లు అర్జున్ డీజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మం) వ‌స్తోంది.

మే లోనే హ‌ను రాఘ‌వ‌పూడి-నితిన్ సినిమా విడుద‌ల కానుంది. వీటితో పాటు గోపీచంద్ న‌టించిన రెండు సినిమాలు వ‌స్తున్నాయి. గోపీచంద్‌-సంప‌త్‌నంది గౌత‌మ్‌నందాతో పాటు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ డైరెక్ష‌న్‌లో గోపీ న‌టించిన సినిమా సైతం స‌మ్మ‌ర్‌కే వ‌స్తోంది.

వీటితో పాటు వెంక‌టేష్ గురు – శ‌ర్వానంద్ రాధా – నాగార్జున రాజుగారిగది 2.. లాంటి సినిమాలు కూడా స‌మ్మ‌ర్ లోనే రాబోతున్నాయి. మొత్త‌మ్మీద ఈ స‌మ్మ‌ర్ దాదాపు 500 కోట్ల బిజినెస్ కు సాక్ష్యంగా నిల‌వ‌నుంది. మ‌రి వీటిలో ప్రేక్ష‌కుల ఓటు ఎవ‌రికి ప‌డుతుందో..? ఎవ‌రు బాక్సాఫీస్ విన్న‌ర్ అనిపించుకుంటారో చూడాలి.