అక్కినేని ఫామిలీ మూడుతరాల హీరోలు కలసి చేసిన మనం సినిమా తెలుగు సినీ జనాలకు మరచిపోలేని అనుభూతినిచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి రెండు పెద్దహీరోల సినిమాల మధ్యలో వచ్చి కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నాగార్జున, నాగచైతన్య లతో ఒక సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు దిల్ రాజు అనుకుంటున్నారట.
అయితే నాగ్, చైతులు కలసి నటిస్తున్నారంటే అది కచ్చితంగా “మనం -2 “నే అవుతుందని అక్కినేని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే సతీష్ వేగేశ్న ఇంకా స్టోరీ డెవలప్మెంట్ పనిలోనే వున్నాడని అదిపూర్తవగానే నాగ్ ని కలిసి ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాలీవుడ్ సమాచారం.