బాహుబలి -2 ఫస్ట్ ప్రేక్షకుడు ఎవరో తెలుసా

రెండేళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉత్కంఠ భ‌రిత క్ష‌ణాల‌కు వ‌చ్చే నెల 28న తెర‌ప‌డ‌నుంది. ప్రాంతీయ భాష అయిన తెలుగులో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాహుబ‌లి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఓ తెలుగువాడు ఇంతటి ఘనత మ‌న‌మంద‌రం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం

బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌తో భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నుంది. ఆ కార్య‌క్ర‌మంలో బాహుబలి-2 ప్రీమియ‌ర్ షోను నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 24న జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలిసి క్వీన్ ఎలిజబెత్ -2 చూస్తారని తెలుస్తోంది.

ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ ఏప్రిల్ 28న విడుద‌ల‌కానున్న‌ది. ప్ర‌భాస్‌, రాణా, అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. బాహుబ‌లి తొలి భాగం పెద్ద హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది భార‌త ప్ర‌భుత్వం బాహుబ‌లిని ఉత్త‌మ చిత్రంగా కూడా ప్ర‌క‌టించింది.