రకుల్ కోరిక తీరినట్టే !

మహేశ్ బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేశారు. ఈ మూవీలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకుందామని ముందుగా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను తప్పించినట్లు వార్తలొచ్చాయి. పరిణీతిని రకుల్ రీప్లేస్ చేస్తుందని అనుకున్నారు. అంతా అనుకున్నట్టే.. రకుల్‌ మహేశ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు లేటెస్ట్ న్యూస్.

ఈ సినిమా షూటింగు ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ముందుగా మహేశ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 11 నుంచి ఈ సినిమా షూటింగులో రకుల్ జాయిన్ అవుతుందని సమాచారం. మహేశ్ బాబుతో కలిసి నటించాలని వుందని రకుల్ అనేక ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చింది. ఈ సినిమా ద్వారా ఆమె కోరిక నెరవేరబోతోంది.