సంతానం కోసం పూజలు చేస్తున్న నటి

నువ్వు నేను సినిమా గుర్తుందా..అందులో అవును రా..ఏంట్రా అంటూ అబ్బాయిలకు దీటుగా కౌంటర్లిచ్చిన అనిత గుర్తుందా.. అనిత ఆ సినిమాతో ఓ రేంజ్ కెళ్ళిపోయింది..ఆ తరువాత అడపా దడపా తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత ఐటెం సాంగ్స్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నా అవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు.ఇక లాభం లేదనుకుందో ఏమో ముంబై కి మకాం మార్చేసి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా అదీ పెద్దగా కలిసిరాకపోవడం తో ఫైనల్ గా హిందీ సీరియల్ తో కాలక్షేపం చేస్తోంది అనిత.

ఇక అనిత వ్యక్తిగత జీవితానికొస్తే ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది అనిత.ఇక అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్ లు,జాలీ ట్రిప్ లు అంటూ సోషల్ మీడియా లో తమ జంట ఫోటోలని షేర్ చేస్తూ హల్చల్ చేస్తోంది అనిత.అయితే ఆ మధ్య అనిత ప్రెగ్నెంట్ అంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంతో..బాబోయ్ నేను ప్రెగ్నెంట్ ని కాదు అది కేవలం ఐస్ క్రీమ్స్ తినడం వల్ల వచ్చిన లావు అంతే అంటూ వివరానిచ్చుకోవాల్సివచ్చింది అనిత.

అయితే తాజాగా అనిత సంతాన భాగ్యం కోసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది.కుటుంభం తో కలిసి రాహుకేతు పూజలు చేయించారు.అనంతరం ఆలయ ప్రాగణంలోని పొగడ చెట్టు వద్ద సంతానం కోసం ప్రదక్షణలు చేశారు.సంతానంతో పాటు తాను నటించిన, ఆర్పీ పట్నాయక్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిస్తోన్న మనలో ఒకడు చిత్రం విడుదల సందర్భంగా చిత్ర విజయంకోసం కూడా పూజలు చేసినట్టు అనిత వివరించింది.అనిత రెండు కోరికలు నెరవేరాలని ఆశిద్దాం.