టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కొడుకుల కెరీర్పై ఇటీవల ఎంతగా కాన్సంట్రేషన్ చేస్తున్నా వాళ్లు సరిగా నిలదొక్కుకోలేకపోతున్నారు. పెద్ద కుమారుడు నాగచైతన్య ఇప్పటకీ స్టార్డమ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్టర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవల వీరిద్దరికి స్టార్డమ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు.
చైతు నటించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్యవహారాలతో పాటు ప్రమోషన్ తదితర అంశాల్లో నాగ్ చాలా స్పెషట్ ఇంట్రస్ట్ తీసుకున్నాడు. అయినా ఈ సినిమా చైతుకు స్టార్డమ్ తేలేదు. ఈ సినిమాలో చాలా సీన్లను నాగ్ రీ షూట్ చేయించి, దగ్గరుండి స్వయంగా ఎడిట్ చేయించినట్టు టాక్.
ఈ క్రమంలోనే చైతుకు ఫుల్ మాస్ ఇమేజ్ తెచ్చేందుకు నాగ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేసేలా భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. చైతుతో సినిమా చేసేందుకు నాగ్ బోయపాటికి ఏకంగా రూ. 12 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ రేటుతో టెంప్ట్ అయిన బోయపాటి చైతుతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్తో బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమా తర్వాత చైతు – బోయపాటి కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.