రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది.

బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా హీరో ఎవ‌రు ? అని ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతానికి అయితే క్లారిటీ లేక‌పోయినా రాజ‌మౌళి ఆయ‌న్ను ఒప్పించేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి మాట ఇవ్వ‌లేదు.

రాజ‌మౌళి దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్‌.నారాయ‌ణ‌కు ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే డీవీవీ దాన‌య్య‌కు ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడంటున్నారు. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ త‌న కుమారుడు స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కేలా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. దీంతో త‌న బ్యాన‌ర్‌లో కాక‌పోయినా రాజ‌మౌళి డేట్స్ ఉన్న నిర్మాత‌లు దాన‌య్య‌, కేఎల్‌.నారాయ‌ణ బ్యాన‌ర్‌లో అయినా త‌న కుమారుడితో ఓ సినిమా చేయాల‌ని అల్లు అర‌వింద్ రాజ‌మౌళి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నాడ‌ట‌.

అయితే కింగ్ అక్కినేని నాగార్జున త‌న రెండో కుమారుడు అఖిల్ – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా కోసం ఇదే నిర్మాత‌ల చుట్టూ తిరుగుతున్నాడ‌ట‌. దీంతో రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో త‌మ వార‌సుల సినిమా కోసం నాగార్జున వ‌ర్సెస్ అల్లు అర‌వింద్ మ‌ధ్య ప‌రోక్ష పోరుకు తెర‌లేచిన‌ట్ల‌య్యింది.