పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య సినిమాలు ఇవే

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూప‌ర్ హిట్ అయిన 9 నెల‌ల‌కే ఫుల్ లెంగ్త్ మాస్ మ‌సాలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న బాల‌య్య ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా చేస్తోన్న బాల‌య్య ఈ సినిమాతో ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య వ‌చ్చే మార్చిలో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాల‌య్య త‌న తండ్రి సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి స్క్రిఫ్ట్ వ‌ర్క్‌తో పాటు ఎన్టీఆర్ సినిమా, రాజ‌కీయ జీవితానికి సంబంధించిన అంశాల‌తో క‌థ రెడీ చేయిస్తున్నాడ‌ట‌.

ఈ సినిమా ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీల‌కు తావులేకుండా ఎన్టీఆర్ సినిమా జీవితంతో ప్రారంభ‌మై ఎన్టీఆర్ ఫ‌స్ట్ టైం అధికారంలోకి వ‌చ్చి సీఎం అయ్యే వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అన్న‌ది మాత్రం సినిమాలో ఉండ‌ద‌ని తెలుస్తోంది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో ఆయ‌న మ‌ర‌ణించే వ‌ర‌కు ఏం జ‌రిగింది అన్న‌ది మొత్తం చూపించాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నా త‌న బావ‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే బాల‌య్య ఎన్టీఆర్ ఫ‌స్ట్ టైం అధికారంలోకి వ‌చ్చి సీఎం అయ్యేంత వ‌ర‌కు మాత్ర‌మే చూపించాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యార‌ట‌.

ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ కాకుండా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 పేరుతో మ‌రో ప్రాజెక్టుకు సైతం బాల‌య్య ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా బాల‌య్య దూకుడు కుర్ర హీరోల‌ను త‌ల‌పిస్తోంది.