బాక్సాఫీస్ బరిలో బాలయ్య చిరు మరోసారి!

కొన్ని దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ సినీ ప్రియులను అలరిస్తున్న ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోల మ‌ధ్య మ‌రోసారి అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో ప‌లుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో పోటీప‌డుతున్నారు. కుర్రహీరోల హ‌వా కొన‌సాగుతోన్న టైంలో కూడా వీరిద్ద‌రు ఈ సంక్రాంతికి త‌మ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150 (చిరు 150వ సినిమా), గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి (బాల‌య్య 100వ సినిమా)ల‌తో పోటీప‌డి ఇద్ద‌రూ సూప‌ర్ హిట్ కొట్టారు.

ఇక ప్ర‌స్తుతం చిరు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌తో సైరా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఆగ‌స్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. క‌ర్ణ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య త‌న తండ్రి దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 28న రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే హ‌డావిడి హ‌డావిడిగా సినిమా తీయ‌డం కంటే రిలాక్స్‌గా, ఎక్క‌డా రాజీలేకుండానే ఈ సినిమా తెర‌కెక్కిస్తే మంచిద‌ని తేజ – బాల‌య్య డిసైడ్ అయ్యార‌ట‌. దీంతో ఈ సినిమాను కూడా వ‌చ్చే ఆగ‌స్టులోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అటు చిరు సైరా, ఇటు బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండూ ఆగ‌స్టులోనే రిలీజ్ అయితే మ‌రోసారి బాల‌య్య వ‌ర్సెస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ఫైట్ అదిరిపోవ‌డం ఖాయం. అయితే దీనిపై కొద్ది రోజుల్లోనే స్ప‌ష్ట‌త రానుంది.