ప‌వ‌న్ – బాల‌య్య ల‌క్కీ బాబులే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ నయా ల‌క్ ద‌క్కించేసుకున్నారు. టాలీవుడ్‌లో సినిమాల‌కు టాప్ సీజ‌న్ ఏదంటే సంక్రాంతి సీజ‌నే. సంక్రాంతి సీజ‌న్ వ‌స్తే ఇక పండ‌గే పండ‌గ‌. ఒకేసారి రెండు మూడే కాదు ఇటీవ‌ల నాలుగు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. గ‌త రెండు సంక్రాంతి సీజ‌న్ల‌కు అయితే ఒకేసారి మూడు, నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చి అన్ని హిట్ అయ్యాయి.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే 2018 సంక్రాంతికి ముందుగా నాలుగైదు పెద్ద సినిమాలు ఖ‌ర్చీఫ్ వేసుకున్నాయి. సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్‌, బాల‌య్య‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్ సినిమాలుండ‌డం, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబోలో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే రూ. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న 2.0 కూడా జ‌న‌వ‌రికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవ‌డంతో ఈ సంక్రాంతి సినిమా పందెం అదిరిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే ట్విస్టుల మీద ట్విస్టుల‌తో సంక్రాంతి రేసు నుంచి ఒక్కో సినిమా వాయిదా మీద వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. షూటింగ్ లేట్ వ‌ల్ల మ‌హేష్ – కొర‌టాల భ‌ర‌త్ అను నేను ఏప్రిల్ 27కు వెళ్లింది. రంగ‌స్థ‌లం కూడా ఈ సంక్రాంతికి విడుద‌ల కావ‌డం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పోటీ ఇష్టం లేక రంగ‌స్థ‌లం వాయిదా వేశార‌ట‌. ఇక రోబో 2.0 వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ లేట్ అవ్వ‌డంతో ఏప్రిల్ 7కు వెళ్లిపోయింది.

ఇక ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో రెండే సినిమాలు ఉన్నాయి. అవి ప‌వ‌న్‌, బాల‌య్య సినిమాలు. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ అజ్ఞాత‌వాసి) జ‌న‌వ‌రి 10న వ‌స్తోంది. ఇక స‌రిగ్గా పండ‌గ రోజున బాల‌య్య జైసింహా వస్తోంది. ఇక వ‌చ్చే సంక్రాంతికి బాల‌య్య‌, ప‌వ‌న్ క‌లెక్ష‌న్లు కుమ్మేసుకోవ‌చ్చు. సినిమాల‌కు హిట్ టాక్ వ‌స్తే చాలు ఈ రెండు సినిమాల‌కు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌న‌డంలో డౌటే లేదు.