టాలీవుడ్లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్కు మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు నడుస్తున్నాయట. ఇవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేని పరిస్థితి ఉంది అంటే పరిస్థితి. ఈ విభేదాల కారణంతో త్రివిక్రమ్ తన సినిమాల్లో దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్సులు ఇవ్వడం లేదని అంటున్నారు.
త్రివిక్రమ్ – దేవి కాంబినేషన్ మ్యూజికల్ హిట్కు పెట్టింది పేరు. వీరిద్దరి కాంబినేషన్లోనే జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సీన్ కట్ చేస్తే అ..ఆ.. సినిమా నుంచి కొత్త కథ మొదలైంది. ఈ సినిమాకు ముందుగా కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ను తీసుకున్నారు. అనిరుధ్ తప్పుకోవడంతో తిరిగి దేవితోనే మ్యూజిక్ చేయిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అందరికి షాక్ ఇస్తూ మిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు.
ఇక ఇప్పుడు పవన్కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు. త్రివిక్రమ్ త్వరలోనే ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు కూడా అనిరుధ్తోనే మ్యూజిక్ చేయించుతాడని ప్రచారం జరుగుతుండటంతో వీరిద్దరి మధ్య విభేదాల టాక్కు మరింత బలం చేకూరింది. ఇక వీరి మధ్య విబేధాలకు ఊతమిచ్చే సంఘటన మరొకటి జరిగింది.
కమల్ హాసన్ల పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన దేవీ శ్రీ, అదే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్కు శుభాకాంక్షలు తెలుపలేదు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవీశ్రీ ప్రసాద్ ల మధ్య ఏదో జరిగిందని ప్రచారం జోరుగా సాగుతోంది.