డీజే స్టోరీని లీక్ చేసిన హరీష్ శెంకర్

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న డీజే సినిమాపై బ్రాహ్మ‌ణ కుల‌స్తులు ఫైర్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన సాంగ్‌లో సాహితి రాసిన ‘అస్మైక భోగ’ పాటలో కొన్ని ప‌దాలు బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు జోరుగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాస్త ఆవేశంగా మాట్లాడుతూ బ‌న్నీ స్టోరీ లైన్ రివీల్ చేసేశాడు.

తాను కూడా ఓ బ్రాహ్మ‌ణుడినే అని చెప్పిన హ‌రీశ్ ‘శాపాదపీ శరాదపీ’ అనే అంశంపై దువ్వాడ జగన్నాధం కథ న‌డుస్తుంద‌ని చెప్పాడు. ఓ బ్రాహ్మ‌ణుడికి కోపం వ‌స్తే శాపంతో లేదా బాణంతో కాని గెలుపు సాధిస్తాడ‌న్న లైన్ బేస్ చేసుకుని ఈ క‌థ రూపొందించిన‌ట్టు బ‌న్నీ చెప్పాడు.

స‌మాజాన్ని నాశ‌నం చేసే కొంద‌రు దుర్మార్గుల‌ను శ‌పించిన ఓ బ్రాహ్మ‌ణుడు వాళ్ల‌ను అంతం చేయ‌డానికి ఏం చేశాడ‌న్న‌దే డీజే స్టోరీ అని హ‌రీశ్ చెప్పిన లైన్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నెల 23న డీజే థియేట‌ర్ల‌లోకి రానుంది.