బాహుబలి సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా ఇండియా దాటేసి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మనోడు టాక్ ఆది పర్సన్ ఆఫ్ నేషన్గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్లగొట్టిన రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటనేదానిపై సహజంగానే అందరిలోను ఆసక్తి నెలకొంది.
రాజమౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆయన నెక్ట్స్ సినిమా ఓ హిస్టారికల్ స్టోరీతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో తన నెక్ట్స్ సినిమాను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
రాజమౌళి రెండు దేశాల మధ్య వార్ బ్యాక్డ్రాప్లో వచ్చే లవ్స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇక ఇందుకోసం ఇండియా – పాకిస్థాన్కు చెందిన యువతీ, యువకుల మధ్య హృద్యంగాను, వార్ నేపథ్యంలోను ఉండే స్టోరీని రెడీ చేయిస్తున్నాడట. ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ విషయంలో నిత్యం జరుగుతున్న ఘర్షణలను, కాల్పుల నేపధ్యంతో పాటు అందులోనే ప్రేమకథతో ఈ సినిమా స్టోరీ ఉంటుందట. ఇలాంటి స్టోరీ అయితేనే తన సినిమాకు నేషనల్ క్రేజ్ వస్తుందన్న ప్లాన్తోనే రాజమౌళి ఈ స్టోరీకి ఓటేసినట్టు తెలుస్తోంది.
ఇక రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పటికే రాజమౌళికి సింగిల్ లైన్ స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడట. ఇప్పుడు దీనిని డవలప్ చేసే పనిలో విజయేంద్రప్రసాద్తో పాటు రాజమౌళి అసిస్టెంట్ల బృందం బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.