గతేడాది బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్సింగ్ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కాజల్ పనైపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు కరువయ్యాయని టాక్ వచ్చింది. ఈ యేడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత రానాతో ఆమె చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా తమిళ్లో విజయ్ సరసన చేసిన అదిరింది సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ కాజల్ జపం చేస్తున్నారు.
ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు కాజల్ కోసం క్యూ కడుతున్నారు. తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు .. హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో కాజల్ రేటు కొండెక్కి కూర్చొంది. తాజాగా కాజల్కు తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా నటించే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకు ఏకంగా ఓ కుర్రహీరో సినిమాలో ఛాన్స్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.
వరుస హిట్లతో దూసుకుపోతోన్న హీరో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ రావడం కన్నా శర్వానంద్ లాంటి ఫామ్లో ఉన్న యంగ్ హీరో పక్కన ఛాన్స్ రావడం చాలా లక్కీనే అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత చాలా మంది యంగ్ హీరోలు కాజల్తో ఆన్స్క్రీన్ రొమాన్స్కు రెడీ అవుతారు.