సౌత్ ఇండియాలో వరుస హిట్లతో దూసుకుపోతూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతోన్న నయనతార ఇటీవల బాగా కమర్షియల్ అయిపోయిందన్న విమర్శలు ఆమెపై ఎక్కువుగా వస్తున్నాయి. ఆమె ఇచ్చిన కాల్షీట్లు దాటితే ఎక్కువ రేటు డిమాండ్ చేయడం కామనే. ఇది కాక సినిమా ప్రమోషన్లకు రానన్న ఖండీషన్ ముందుగానే చెప్పేస్తుంది.
ఏదైనా సినిమా ప్రమోషన్కు ఆమె వచ్చినా అందుకు సపరేట్ రేటు చెల్లించాలి. తాజాగా ఆమె గోపీచంద్ సరసన నటించిన ఆరడుగుల బుల్లెట్ ప్రమోషన్ డిమాండ్ చేసిన రేటు విని నిర్మాతల గుండె గుబేల్ మందట. గత నాలుగు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు గత వారం రిలీజ్ చేయాలనుకున్న కుదరలేదు.
ఈ నెల చివర్లోనో లేదా వచ్చే నెలలోనే ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రేజ్ తీసుకువచ్చేందుకు గాను నిర్మాతల నయనతారను ప్రమోషన్కు రమ్మని రిక్వెస్ట్ చేశారట. తాను ప్రమోషన్కు రావాలంటే రూ.30 లక్షలు ఇస్తేనే వస్తానని ఆమె చెప్పిందట. ఈ రేటు విని షాక్ అవ్వడం నిర్మాతల వంతు అయ్యిందట. ఏదేమైనా నయనతార భారీ కమర్షియలైజ్ అయ్యిందని మరోసారి ఈ సంఘటన రుజువు చేసినట్లయ్యింది.