రష్మి గౌతమ్ ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద ఉన్న అందరూ యాంకర్లలోను టాప్మోస్ట్ హాట్ యాంకర్. ముందుగా సీరియళ్లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న టైంలో జబర్దస్త్ యాంకర్గా ఆమె ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ దెబ్బతో ఆ షో రేటింగ్ పీక్ స్టేజ్కు చేరుకోవడంతో పాటు ఆమె చిట్టి పొట్టి దుస్తులకు, హాట్ హాట్ మాటలకు తెలుగు కుర్రకారు పడిపోయారంతే.
ఈ షో తర్వాత రష్మి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో ఆమే ఇమేజ్ మారిపోయింది. ఈ హాట్ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఆమె వెండితెరమీదకు కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సినిమాల్లోనూ బోల్డ్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ‘గుంటూరు టాకీస్’లో రష్మి అందాల ప్రదర్శన కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఆ సినిమాకు కేవలం రష్మి వల్లే భారీ లాభాలు వచ్చాయి.
గుంటూరు టాకీస్ తర్వాత రష్మికి చాలా ఛాన్సులు వెండితెరపై వచ్చాయి. ఆ తర్వాత అంత సక్సెస్ కాని రష్మి తాజాగా వచ్చిన ప్రభాకర్ నెక్ట్స్ నువ్వే సినిమాతో మళ్లీ మెప్పించింది. ఈ సినిమాలో రష్మి వేసిన ఓ హాట్ డైలాగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో ఆదితో ‘‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెలుసా.. అది తినదు.. వేరే వాళ్లను తిననివ్వదు’’ అని అంటుంది.
ఈ డైలాగ్పై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ డైలాగ్పై రచ్చ జరుగుతుండడంతో రష్మి స్పందించింది. తాను ఈ డైలాగ్ వేసేటప్పుడు ఏం అసభ్యంగా కనిపించలేదని, పద్దతైన దుస్తుల్లోనే ఉన్నానని, దీనిని ఎందుకు ఇంత రభస చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పింది. ఇటీవల చాలా సినిమాల్లో ఏకంగా బూతు సీన్లే చూపిస్తుంటే, పద్ధతైన ఈ డైలాగ్ను పట్టుకుని రభస చేయడం ఏంటో ? తనకు అర్థం కావడం లేదని రష్మి వాపోయింది.