యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్స్టార్ పవన్కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ ప్రస్తుత జనరేషన్లో టాప్ హీరోలుగా ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే వేదికమీద కనపడడం అరుదైన సంఘటనగా నిలిచింది.
ఈ సినిమా డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్కు చాలా సన్నిహితుడు కావడంతో పవన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యక్రమానికి హాజరైన పవన్కు ఎన్టీఆర్ ఎదురెళ్లి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
పవన్ను ఎట్రాక్ట్ చేసింది ఇదే…
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ పూజా కార్యక్రమాలనంతరం వెళ్తూ వెళ్తూ ఓ చోట ఆగిపోయారు. గణేశున్ని పూలతో అందంగా అలంకరించిన ప్రతిమను అలాగే చూస్తూ ఉండిపోయారు. అనంతరం అక్కడే మరోసారి అందరితో ఫోటోలు దిగి.. ఎన్టీఆర్కు మరోసారి విషెస్ తెలిపి వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తోన్న పవన్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనాల్లోకి వెళ్లనున్నాడు.