త్రివిక్ర‌మ్ సినిమాకు సెంటిమెంట్ వాడుతోన్న‌ ప‌వ‌న్‌

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ అయ్యింది. గ‌తేడాది స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ ఈ యేడాది కాట‌మ‌రాయుడుతో మ‌రో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. స‌ర్దార్ బ‌య్య‌ర్లే రూ.25 కోట్ల వ‌ర‌కు నిండా మునిగితే ఇప్పుడు కాట‌మ‌రాయుడు బ‌య్య‌ర్లు కూడా రూ. 25-30 కోట్ల వ‌ర‌కు మున‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్‌ను ప‌క్క‌న పెట్టిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ – అను ఇమ్మాన్యుయ‌ల్‌పై ప్రేమ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే గ‌త రెండు సినిమాల‌తో ఘోర‌మైన ప్లాప్‌లు ఎదుర్కొన్న ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ సినిమాతో హిట్ కొట్టాల‌ని గ‌ట్టిగా డిసైడ్ అయిన‌ట్లున్నాడు. ఈ క్ర‌మంలోనే సెంటిమెంట్‌ను న‌మ్ముకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాను ముందుగా అనుకున్న‌ట్టు ఆగస్టు 11న కాకుండా సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తారట.

ప‌వ‌న్ చివ‌రి రెండు చిత్రాలు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ప‌వ‌న్‌కు త‌ప్ప‌నిస‌రిగా హిట్ కావాల్సి ఉంది. ఇక ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అత్తారింటికి దారేది సినిమా సెప్టెంబర్‌లోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఈ సినిమాను కూడా సెప్టెంబ‌ర్‌లోనే రిలీజ్ చేయాల‌ని ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ డిసైడ్ అయ్యార‌ట‌.