బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మన దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడు ? ఆయన నెక్ట్స్ సినిమాలో హీరో ఎవరు ? లాంటి ప్రశ్నలు జాతీయ మీడియాలో కూడా చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది పెద్ద సంచలనమే అవుతుంది.
తాజాగా రాజమౌళి తన ఫేస్బుక్లో పేజ్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్ హాట్గా మారింది. రాజమౌళి ఓ మల్టీస్టారర్కు రెడీ అవుతున్నాడట. అది కూడా టాలీవుడ్లో టాప్ హీరోలుగా ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్, చెర్రీతో రాజమౌళి నెక్ట్స్ సినిమా ఉంటుందని, ఈ క్రేజీ ప్రాజెక్టు 2018లో ప్రారంభమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకు మ్యాటర్ ఏంటంటే రాజమౌళి శనివారం సాయంత్రం ఎన్టీఆర్, చెర్రీతో ఎంతో జాయ్ఫుల్గా దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నవ్వులు చిందిస్తూ ఓ పక్క చెర్రీ, మరోపక్క ఎన్టీఆర్ ఉండగా మధ్యలో రాజమౌళి కూర్చొని ఉన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఇక రాజమౌళి ఇటీవలే తన తండ్రి విజయేంద్రప్రసాద్తో ఓ మల్టీస్టారర్ సినిమాకు కథ రెడీ చేయమని చెప్పాడట. ఈ స్టోరీలో మంచి బలమైన మెసేజ్ ఉంటుందట. ఈ సినిమాలో అజిత్, అల్లు అర్జున్ హీరోలుగా చేస్తారని ముందు వార్తలు వచ్చినా ఇప్పుడు ఎన్టీఆర్, చెర్రీ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది.