ర‌వితేజ కొత్త రేటు… మ‌రీ టూ మ‌చ్‌

ప్ర‌స్తుతం సినిమా అనేది వ్యాపారం అయిపోయింది. ఇక్క‌డ విలువ‌ల‌కు చోటే లేదు. ఇక హీరోల్లో చాలా మంది క‌థ‌, క‌థ‌నాలు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చి నీకెంత నాకింత అనే ధోర‌ణిలోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌న ప‌ట్టు ఏ మాత్రం విడ‌వ‌డ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత ర‌వితేజ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఈ టైంలో మ‌నోడిని కాస్త రేటు త‌గ్గించుకోమ‌ని చాలా మంది నిర్మాత‌లు రిక్వెస్ట్ చేసినా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో ర‌వితేజ సినిమాలు లేకుండానే రెండేళ్ల‌పాటు ఖాళీగానే కూర్చొన్నాడు.

ఎట్ట‌కేల‌కు రాజా ది గ్రేట్ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టి తిరిగి ఫామ్‌లోకి రావ‌డంతో మ‌ళ్లీ ర‌వితేజ త‌న రేటు పెంచేసిన‌ట్టు టాక్‌. బెంగాల్ టైగర్ వరకు ఓ లిమిట్స్‌లో రెమ్యున‌రేష‌న్ అందుకున్న ర‌వితేజ ఇప్పుడు మ‌రింత‌గా డిమాండ్ చేస్తున్న‌ట్టు టాక్‌. దీంతో ఇప్పుడు ర‌వితేజ‌తో సినిమాలు చేయాల‌నుకుంటోన్న నిర్మాత‌లు అత‌డి రేటు చూసి షాక్ అవుతున్నార‌ట‌. ఇది మ‌రీ టూ మ‌చ్ అని వాపోతున్న‌ట్టు తెలుస్తోంది.

ర‌వితేజ తాజాగా కోలీవుడ్ హిట్ మూవీ బోగ‌న్ రీమేక్‌లో న‌టిస్తాడ‌ని, ఈ ప్రాజెక్టు సెట్స్‌మీద‌కు వెళ్ల‌డ‌మే త‌రువాయి అని అంద‌రూ అనుకున్నారు. అయితే మ‌నోడు స‌డెన్‌గా ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం వెన‌క రెమ్యున‌రేష‌నే కార‌ణమ‌ని టాక్‌. నిర్మాత‌లు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వకపోతుండడంతో రవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ప్రస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమాను మాత్రమే రవి చేస్తున్నాడు. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో విన‌ప‌డుతోన్న టాక్ ప్ర‌కారం ర‌వితేజ ప్ర‌స్తుతం రూ.12 కోట్ల‌కు త‌క్కువైతే సినిమాలు ఒప్పుకునే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది.