యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజే వేరు. బాలయ్య ఎన్ని ప్లాపులు ఇచ్చినా ఆయన సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లోను, టాలీవుడ్ సినీజనాల్లోను ఎక్కడా లేని ఆసక్తి ఉంటుంది. ఇక బాలయ్య 100వ సినిమా శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య నెక్ట్స్ సినిమాపై ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే రచ్చ రచ్చే అవుతుందన్న అంచనా ఉంటుంది.
ఈ క్రమంలోనే బాలయ్య -పూరి కాంబోలో తెరకెక్కుతోన్న పైసా వసూల్ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ అయినప్పటి నుంచే ఎక్కడా లేని ఆసక్తి క్రియేట్ చేసుకుంది. పైసా వసూల్ అనే మాస్ టైటిల్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడే పైసా వసూల్కు మార్కెట్ ఓపెన్ అయిపోయింది. అన్ని ఏరియాల నుంచి బిజినెస్ ఎంక్వైరీలు వచ్చేస్తున్నాయి.
చిత్ర నిర్మాతలు మాత్రం ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేట్లు చెపుతున్నారట. ఓవర్సీస్ రైట్స్ను ఏకంగా రూ.5 కోట్లు చెప్పారట. అక్కడ లెజెండ్ లాంటి సినిమాలే రూ. 2 కోట్లు వసూలు చేయలేదు. శాతకర్ణిని సొంతంగా విడుదల చేసుకున్నారు. ఇక అక్కడ క్రిష్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా శాతకర్ణి అక్కడ 1.5 మిలియన్ డాలర్లు రాబట్టింది.
ఇక పూరి వరుసగా నాలుగు ప్లాపులు ఇచ్చాడు. మరి పూరిని చూసి పైసా వసూల్కు ఓవర్సీస్లో రూ.5 కోట్లు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. వచ్చిన ఒకరిద్దరు కూడా ఈ భారీ రేటు చూసి పరార్ అవుతున్నారట.