టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు స్టార్, యంగ్ హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్ పేర్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రగ్ విషయంలో నోటీసులు అందుకున్న వారికి అందరికి ఓ కామన్ లింకు ఉంది. అదే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తన టీంలో అందరికి డ్రగ్స్ అలవాటు చేసేవాడని తెలుస్తోంది.
చార్మీ, మమైత్ఖాన్, సుబ్బరాజు, రవితేజ, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా వీరందరూ పూరి కంపెనీకి చెందిన వారే. తన దగ్గర పనిచేసే వాళ్లకు పూరియే ఇలా డ్రగ్స్ అలవాటు చేసినట్టు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో వీళ్లకు డ్రగ్ సరఫరా చేస్తోన్న కెల్విన్ పలు షాకింగ్ విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ డ్రగ్స్కు విపరీతంగా బానిస అయ్యాడని తెలుస్తోంది. కెల్విన్ బయటకు వెళితే విమాన టిక్కెట్లు ఇచ్చి మరీ డ్రగ్స్ కోసం హైదరాబాద్ రప్పించుకునే వాడట. పూరియే తన యూనిట్తో చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేశాడని కెల్విన్ సమాచారం ఆధారంగా పోలీసులు నిర్దారణకు వచ్చారు.
ఇక కెల్విన్కు పూరి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడట. తన షూటింగ్ స్పాట్లో ఏది కావాలంటే అది వచ్చి చేసుకోమని చెప్పాడంటే పూరి ఏ రేంజ్లో డ్రగ్స్కు బానిస అయ్యాడో అర్థం చేసుకోవచ్చంటున్నారు.