దర్శకరత్న దాసరి నారాయణరావు హఠాన్మరణం ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ఇస్తోంది. దాసరి లైఫ్ ఇచ్చి ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్న చాలా మంది ఆయన శిష్యగణం దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. దాసరి మృతి తర్వాత ఆయనకు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దాసరి అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే ఆయన పెద్ద కోడలు సుశీల ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇక ఆస్తి పంపకాలపై కూడా ఆమె నానా రచ్చ రచ్చ చేశారు.
ఈ వార్త ఇలా ఉండగానే ఇప్పుడు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దాసరికి టాలీవుడ్కు చెందిన ఓ అగ్రనిర్మాత రూ.12 కోట్ల వరకు అప్పుడు ఉన్నాడట. ఆయన నిర్మాతగాను, పంపిణీదారుడిగాను కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదీవేల విషయం చాలా సీక్రెట్గా ఉండేదట. మోహన్బాబు లాంటి ఒకరిద్దరికి మాత్రమే ఈ మ్యాటర్ తెలుసన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సదరు నిర్మాత 2011లో ఓ అగ్రహీరోతో తీసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పుడు ఆయన కోలుకునేందుకు దాసరి ఈ మొత్తం ఎడ్జెస్ట్ చేశారని టాక్. దాసరి జీవించి ఉన్నన్ని రోజులు సదరు నిర్మాత ఆ మొత్తాన్ని మూడు నెలలు, ఆరు నెలలు అంటూ వాయిదా వేసుకుంటూ సరిపెట్టేశారు.
ఇక ఇప్పుడు దాసరి లేకపోవడంతో ఆయన ఈ రూ.12 కోట్లను ఎగనామం పెట్టే పనిలో ఉన్నాడట. ఒకవేళ మోహన్బాబుతో పాటు దాసరి సన్నిహితులు ఎవరైనా ఒత్తిడి చేస్తే తులమో, ఫలమో ఇచ్చి చేతులు దులుపుకునే పనిలో ఉన్నారట. సదరు నిర్మాత వివాదాలకు కేంద్ర బిందువు. దాసరికి చాలా సన్నిహితుడు కూడా…ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందనుకుంట.