అఖిల్తో అధః పాతాళానికి పడిపోయిన స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి వినాయక్ స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఖైదీ తర్వాత వినాయక్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు.
ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం వినాయక్ నెక్ట్ సినిమా మరో మెగా హీరోతోనే ఉంటుందని తెలుస్తోంది. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తిక్క, విన్నర్ వరుసగా ప్లాపులు అవ్వడంతో కాస్త రేసులో వెనక పడ్డాడు.
ప్రస్తుతం సాయి బీవీఎస్.రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సాయి చేసేది వినాయక్తోనే అని టాక్. ఇక ఈ సినిమాకు దుర్గ అనే టైటిల్ వినాయక్ పరిశీలిస్తున్నాడట. ఆకుల శివతో కలిసి వినాయక్ అదిరిపోయే పవర్ ఫుల్ మాస్ కథను రెడీ చేస్తున్నాడట.