దగ్గుపాటి వారి వారసుడు రానా ఈ యేడాది బాహుబలి 2 సినిమాతో ఇప్పటికే పవర్ ఫుల్ విలన్గా మెప్పించేశాడు. బాహుబలి 2 సినిమాలోని భల్లాలదేవుడి పాత్రలో దేశవ్యాప్తంగానే క్రూరమైన విలన్గా లక్షలాది ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు రానా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. జోగేంద్ర పాత్రలో రానా పంచెకట్టు కట్టి అలా ఒదిగిపోయాడు. రానా ఏకంగా సీఎంనే ఢీకొట్టి సీఎం అవుతానని ఛాలెంజ్ చేస్తున్నాడు. టోటల్గా పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా నేనే రాజు – నేనే మంత్రి తెరకెక్కుతున్నట్టు ట్రైలర్ చెపుతోంది.
సీఎంతో వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్లో పెడితే సాయంత్రానికి నేనే సీఎంను అనే పంచ్ డైలాగ్ పేలుస్తాడు. అలాగే లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలని రానా చెప్పిన డైలాగ్ సినిమాకు పాలిటిక్స్కు ఉన్న సంబంధాన్ని చెపుతోంది. ఇక ట్రైలర్లో చివరగా మావా వెనకటికి ఓ సామెత ఉండేది… పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి అన్న డైలాగ్ ఉంటుంది.
ఇక టీజర్లో పోసాని పుట్టినవాడు మరణించక తప్పదు..మరణించిన వాడు పుట్టకా తప్పదు ఆమెన్ అని అంటాడు. ఆ వెంటనే రానా నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా… నువ్వు ఎప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్తో టీజర్ను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇక ఇప్పుడు ట్రైలర్తో కేక పెట్టిం చేస్తున్నాడు.
ఇక కథానుసారం కాజల్ నిడివి తక్కువుగా ఉంటుందని, ఆమె రానా రాజకీయ ప్రత్యర్థుల చేతిలో చనిపోతుందని కూడా తెలుస్తోంది. కేథరిన్ థెస్రా పాలిటిక్స్లో ఉండే లేడీ రౌడీ క్యారెక్టర్లో కనిపించనుంది. మరి ట్రైలర్తోనే సెగలు పుట్టిస్తోన్న రానా సినిమాలో ఎలా ఇరగదీస్తాడో చూడాలి.