మెగాస్టార్ చిరంజీవికి టెన్షన్ స్టార్ అయ్యిందట. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో ఆయన నెక్ట్స్ సినిమా ప్లాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖైదీ హిట్ అయినా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్గా రావడం, రొటీన్ స్టోరీ కావడంతో విమర్శలే ఎదుర్కొన్నాడు. ఇక అదే టైంలో ఖైదీకి పోటీగా వచ్చిన శాతకర్ణి సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.
దీంతో చిరు తన 151వ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ స్టోరీతో సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని చిరు చాలా పట్టుదలతో ఉన్నారు. ఉయ్యాలవాడ చాలా విజువల్ ఎఫెక్ట్స్తో కూడుకుని ఉంటుంది. ఇక బాహుబలి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి..కనీసం ఆ సినిమాకు తగ్గకుండా విజువల్స్ ఉండాలని చిరు టీం చాలా కేర్ తీసుకుంటోంది.
ఉయ్యాలవాడను ఎంతో ప్రెస్టేజియస్గా తీసుకున్న చిరు ఈ సినిమాను ఓ రేంజ్లో ఉండేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సమాంతరంగా ఇలాంటి తరహా సినిమాలు నిర్మాణంలో ఉండడంతో చిరుకు పెద్ద టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. బాలీవుడ్లో మణికర్ణిక, పద్మావతి చిత్రాలతో పాటు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అనే భారీ చిత్రం కూడా తెరకెక్కనుంది.
తాజాగా అజయ్ దేవ్గణ్ కూడా అలాంటి సినిమానే మొదలు పెట్టాడు. ఛత్రపతి శివాజీ వెంట వుండి పోరాడిన ఒక గొప్ప యోధుడు తానాజీ కథతో అజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాలకు ధీటుగా, భిన్నంగా ఉయ్యాలవాడ లేకపోతే చిరు సినిమా గుంపులో గోవిందయ్య మాదిరిగా మారిపోవడం ఖాయం. దీంతో చిరుకు ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.