ఆమెతో కలిపి 7 గురితో వెంకీ!

‘బాబు బంగారం’పై విక్టరీ వెంకటేష్ ధీమాగానే ఉన్నారు. మారుతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్-యాక్షన్-కామెడీ చిత్రం సక్సెస్‌ అవడం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పని పూర్తైపోవడంతో.. వెంకీ తదుపరి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

‘సాలా ఖడూస్’ రీమేక్‌తో పాటూ ”నేను శైలజ” డైరక్ట.. కిషోర్ తిరుమలతోనూ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి పేరు కూడా పెట్టేశారు. ”ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ తో ఈ పిక్చర్ రాబోతోంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయమొకటి ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ ఒక్కరే అయినా.. కొన్ని స్పెషల్ సీన్లలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఈ సినిమాలోనూ వెంకీ తనదైన వినోదం పండిస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తారని అంటున్నారు.