చిరు ఆటో జానీ లో ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా వక్కంతం వంశి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా ని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆలస్యం అయ్యేటట్టు ఉండటం తో సినిమా కి సినిమాకి గ్యాప్ వుండకూదహనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూరి జగన్నాద్ తో ప్లాన్ చేసుకున్నాడట.

ఈ సినిమాకి సంబంధించిన కధని కూడా పూరి జనతా గ్యారేజ్ షూటింగ్ సమయం లోనే ఎన్టీఆర్ కి వినిపించాడని దానికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేసాడని సమాచారం. అయితే పూరి వినిపించిన ఆ స్టోరీ తాను మెగాస్టార్ చిరంజీవి 150 వ. సినిమాకోసం రెడీ చేసిన ‘ఆటో జానీ’ కధే నని, అప్పుడు చిరంజీవి తో ఆ సినిమా చేయటం కుదరక పోవటం తో ఆ స్టోరీతోనే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసాడని టాలీవుడ్ సమాచారం.