చెర్రీ ఎవ్వర్నీ వదల్లేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు.ఉన్నట్టుండి చెర్రీ ఎందుకింత యాక్టీవ్ అయ్యాడా అని చర్చించుకుంటున్నారు.చిరంజీవి 150 వ వ సినిమా షూటింగ్,ధ్రువ సినిమా కాశ్మీర్ లో వర్కింగ్ స్టిల్స్ దగ్గరినుండి చివరికి చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి నడుచుకుంటూ వస్తున్న ఫోటోలను కూడా షేర్ చేయడం అభిమానులకి ఆనందాన్నిచ్చింది.అయితే సినీ విమర్శకులని మాత్రం చరణ్ లేటెస్ట్ స్టెప్ ఆలోచింపచేస్తుంది.

ఇక తాజాగా ఫేస్ బుక్ లో అభిమానులతో చరణ్ చాట్ చేసి సరి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు.అభిమానులతో లైవ్ వీడియో లో అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు.ఈ సమాధానాలతో దాదాపు టాలీవుడ్ అంతటిని కవర్ చేసేసాడు చెర్రీ.ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా దాదాపు అందరిగురించి ఓపెన్ గా సమాధానం ఇవ్వడం అభిమానుల అందానికి హద్దుల్లేకుండా చేసింది.

హీరో ప్రభాస్ తాను మంచి ఫ్రెండ్స్ అని,మహేష్ బాబు హ్యాండ్సమ్ అని,ఈ మద్యే బాహుబలి సెట్స్ కి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చాడు.బాబాయ్ పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ ఇయర్ సినిమా ఉండొచ్చని చెప్పాడు చరణ్.అయినా పవన్కళ్యాణ్ కి తీరిక దొరికి,అదే టైం కి చరణ్ కూడా గ్యాప్ తీసుకొని ఇది పట్టాలెక్కేది జరిగేపనేనా.ఇక ధ్రువ 1st లుక్ ఆగస్ట్-15 కి రిలీస్ చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలిపాడు.ఇక చిరు 150 వ సినిమాలో ఏదయినా సాంగ్ లోనో,సీన్ లోను కుదిరితే చిరు,వినాయక్ గారికి అనిపిస్తే కనిపిస్తానంటున్నాడు చెర్రీ.