దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్. వంశీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ఈ సినిమా. ఆ వంశీనే ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిచబోతున్నాడు. ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లకి పట్టాలెక్కబోతోంది.
ఈ సినిమాలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాబాయ్ వెంకటేష్లాగ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందట ఈ కుర్రాడిలో. అయితే ఎంట్రీ ఇచ్చినాక ఆ విషయాన్ని ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నారు. వారి కోసం ఇంకా పరిశీలన జరుగుతోంది. ఫ్రెష్ లుక్ కోసం కొత్త హీరోయిన్స్కి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారట. మధురా శ్రీధర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొని, ఈ సినిమా వచ్చే నెల్లోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాకి ‘ఫ్యాషన్ డిజైనర్.. సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తోన్న ముచ్చటగా మూడో హీరో అభిరామ్. నటన విషయానికొస్తే బాబాయ్ వెంకీది ఒక దారి. రానాది మరో దారి. హీరోగానే కాకుండా, రానా అన్ని రకాల పాత్రల్లోనూ అలరిస్తున్నాడు. అలాగే అభిరామ్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.