డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు గోపీచంద్. `యజ్ఞం`, `ఆంధ్రుడు`, `లక్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు `ఆక్సిజన్` అనే మరో డిఫరెంట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది.
`ఏమైంది ఈవేళ` అనే యూత్ఫుల్ లవ్ ఎంటర్ టైనర్తో సక్సెస్ కొట్టి తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్తో `రచ్చ` అనే సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా మాస్ మహారాజా రవితేజను `బెంగాల్ టైగర్` అంటూ సరికొత్త యాంగిల్లో ప్రెజంట్ చేసిన స్టార్ డైరెక్టర్ సంపత్ నంది. ఈ మూడు చిత్రాలను మూడు డిఫరెంట్ ఫార్మేట్స్ లో నిర్మించి హ్యాట్రిక్ సాధించిన దర్శకుడు సంపత్ నంది దర్శత్వంలో శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్పై జె.పుల్లారావు౼జె.భగవాన్ నిర్మాతలుగా ఓ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా రూపొందుతుంది.
సౌఖ్యం సినిమాతో అతి పెద్ద ప్లాప్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ సంపత్ నందితి సినిమాతో భారీ హిట్ కొట్టి మాస్ హీరోగా మళ్ళీ తానేంటో నిరూపించుకోవాలని పట్టుదలగా వున్నాడు.