ఎన్టీఆర్ చివరి మూడు సినిమాలకు ప్రతి సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. టెంపర్ రేంజ్ రూ. 45 కోట్లలో ఉంటే నాన్నకు ప్రేమతో రేంజ్ రూ. 55 కోట్లకు దగ్గరైంది. ఇక జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు ఏకంగా రూ.85 కోట్లకు దగ్గరైంది. వరుస హిట్లతో వెండితెరను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ ఇటు బిగ్ బాస్ హోస్టర్గా బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా జై లవకుశకు ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ కేకులా మారింది. ఈ సినిమా ఏరియాల రైట్స్ కోసం బయ్యర్లు పోటీపడుతుండడంతో బిజినెస్ స్పీడ్గా కంప్లీట్ అవుతోంది. జై లవకుశ సినిమా థియేటర్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 70 కోట్లకు అమ్ముడయ్యాయి.
జీఎస్డీ లేకుండానే ఈ సినిమాకు ఈ రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన జై లవకుశ సినిమాలోని జై టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఏరియాల వారీగా చూస్తే నైజాంను దిల్ రాజు ( 20 కోట్లు) -సీడెడ్ గంగాధర్ అండ్ (13.5 కోట్లు ) – కృష్ణ, గుంటూరును సుధాకర్, ఈస్ట్ రైట్స్ భరత్ పిక్చర్స్ ( 6 కోట్లు), వెస్ట్ ఉషా పిక్చర్స్, నెల్లూరును పవన్ పిక్చర్స్ కొనుగోలు చేశారు. ఇక విశాఖ రైట్స్ రేటు రూ. 9 కోట్ల దగ్గర పెండింగ్లో ఉంది.
ఓవరాల్గా అన్ని రైట్స్ కలుపుకుంటే జై లవకుశ బిజినెస్ రూ. 120 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ లెక్కన ఈ సినిమా కొన్న బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే సినిమా భారీ రేంజ్లో వసూళ్లు రాబట్టాలి. దసరా కానుకగా సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ అవుతోంది.