NTR,కళ్యాణ్ కలిస్తే దండయాత్రే

రచయితలుగా సినీ ప్రస్థానం ప్రారంభించి దర్శకులుగా దూసుకుపోయిన,పోతున్న చాలామందిని మనం చూస్తూనే వున్నాం.ఈ తరహాలో ముక్యంగా చెప్పుకోవాల్సింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,కొరటాల శివ గురించి.వల్లే కాదు ఇంకా చాలామంది రచయితలు దర్శకులుగా సత్తాచాటుతున్నారు.తాజాగా ఈ జాబితాలో వక్కంతం వంశీ కూడా చేరనున్నారు.

దండయాత్ర..ఇది దయా గాడి దండయాత్ర అంటూ NTR తో టెంపర్ సినిమాతో దండయాత్ర చేయించాడీ రచయిత వక్కంతం వంశీ.టెంపర్ సినిమాకి ప్రాణమే కథ,కథనం,క్లయిమాక్స్,NTR నటన.అంతలా NTR దండయాత్ర చేయడానికి కథలోని డెప్త్ కూడా లాగే ఉండడం వల్లనే సాధ్యం అయిందన్నది వాస్తవం.

అయితే తాజాగా వక్కంతం వంశీ దర్శకుడిగా మారి NTR తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమా NTR జనతా గారేజ్ రిలీజ్ అయినా తరువాత పట్టాలెక్కనుంది అని సమాచారం.ఇదొక బీభత్సమైన మాస్ సినిమా అని,చేస్తే NTR తోనే ఈ సినిమా చేయాలని వక్కంతం ఈ కథని తయారుచేసాడట.ఇక్కడ ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ చిత్రానికి NTR అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా NTR ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.కేవలం వక్కంతం కథతోనే నట విశ్వరూపం చూపించిన NTR ఇక కథ దర్శకత్వం రెండు వక్కంతం అంటే అదీ NTR ఆర్ట్స్ బ్యానర్ లో తొలి సారి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.