ప‌వ‌న్ రివ‌ర్స్ గేర్‌..!

కాట‌మ‌రాయుడు త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కించేందుకు స్పీడ్‌గేర్‌లో దూసుకు వెళుతున్నాడు. కాట‌మ‌రాయుడు త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాను ప‌ట్టాలెక్కించిన ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత నీశ‌న్ డైరెక్ష‌న్‌లో వేదాళం మూవీ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత ర‌భ‌స‌, హైప‌ర్ డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో మరో రీమేక్‌కు ఓకే చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ వ‌రుస‌గా రీమేక్‌లు, అది కూడా అంతగా ఫామ్‌లోలేని డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసేందుకు ఒప్పుకోవ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆందోళ‌న చెందారు. ఇప్ప‌టికే స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – కాట‌మ‌రాయుడు లాంటి రెండు డిజాస్ట‌ర్ల‌తో ఉన్న ప‌వ‌న్ తుప్పు ప‌ట్టిపోయిన రీమేక్‌లు, అది కూడా ఫామ్‌లో లేని డైరెక్ట‌ర్ల‌కు ఓకే చెప్ప‌డం ఏంటా అని అంద‌రూ మైండ్ బ్లాక్ అయ్యి ఉన్నారు.

అయితే కాట‌మ‌రాయుడు రిజ‌ల్ట్‌తో ప‌వ‌న్ త‌న మ‌న‌స్సు మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. కాట‌మ‌రాయుడు రీమేక్ కావ‌డం, ఆ సినిమా స్టోరీ అంద‌రికి ముందే తెలిసిపోవ‌డం, సినిమా రిజ‌ల్ట్ కూడా దారుణంగా ఉండ‌డంతో ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ త‌ర్వాత చేసే నీశ‌న్ సినిమాను ప‌క్క‌న పెట్టిన‌ట్టే తెలుస్తోంది. ఇది అజిత్ వేదాళంకు రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఇక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టు కూడా ఉంటే కొత్త క‌థ‌తో ఉంటుందే త‌ప్ప…రీమేక్ స్టోరీతో ఉండ‌ద‌ట‌. ఏదేమైనా కాటమరాయుడు రిజల్ట్‌తో పవన్ రీమేక్ సినిమాల జోలికి వెళ్లకపోవటమే బెటర్ అని నిర్ణయించుకున్నాడు.