నంద్యాల ప్రచారం రచ్చ రచ్చగా మారుతోంది. అటు అధికార టీడీపీ వాళ్లు, ఇటు విపక్ష వైసీపీ వాళ్లు పరస్పరం తిట్ల విషయంలో పోటీపడి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. జగన్, రోజా, బాలయ్య, చంద్రబాబు, వేణు మాధవ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అభ్యర్థులు కాకుండా స్టేట్ వైడ్ సెలబ్రిటీలు చాలా మందే మకాం వేసి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
రోజా ఎక్కడైనా ఎంట్రీ ఇస్తే ఆ ప్రచారం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక రోజాను టార్గెట్ చేయడంలో అధికార టీడీపీలో సరైన వాళ్లే లేకుండా పోయారు. టీడీపీకి ఇక్కడ జంబో జెట్ టీం పెద్దగానే ఉన్నా వాళ్లకు జగన్ను, వైసీపీ వాళ్లను, శిల్పాను తిట్టడం ఇలా చాలా పనులే ఉన్నాయి. ఇక రోజా రచ్చ రంబోలా డైలాగ్కు కౌంటర్ ఇవ్వడం వాళ్లకు కష్టంగానే మారింది.
ఇక ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ నంద్యాలలో టీడీపీ గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు మీడియాతో మాట్లాడుతూ రోజాకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. ‘రోజాకు మీరైతేనే కౌంటర్ ఇవ్వగలరన్న ఉద్దేశంతోనే టీడీపీ మిమ్మల్ని ప్రచారంలోకి దింపిందట’ నిజమేనా ? అన్న మీడియా ప్రశ్నకు వేణుమాధవ్ స్పందిస్తూ సారీ ఆమె ఎవరో నాకు తెలియదు..ఆమె గురించి అడగవద్దని రోజా గాలి మొత్తం తీసేశాడు.
ఇక టీడీపీతో తన అనుబంధం దివంగత ఎన్టీఆర్ టైం నుంచి ఉందని, నందమూరి ఫ్యామిలీ అన్నా, భూమా ఫ్యామిలీ అన్నా తనకు చాలా ఇష్టమని ఆ కుటుంబాలతో ఉన్న అనుబంధంతోనే తాను నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ప్రచారం చేస్తున్నానని వేణు చెప్పారు. నంద్యాలలో టీడీపీ గెలుపుపై అసలే మాత్రం డౌట్ వద్దు… మెజార్టీ 30, 40, 50 వేలా లేదా వైసీపీకి డిపాజిట్లే రావా ? అన్నది మాత్రమే చూడాలని పంచ్ పేల్చారు.
ఇక ప్రచారంలో మధ్యమధ్యలో ఉర్దూలో మాట్లాడుతూ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన మాటలు, హావభావాలతో ప్రజలను కడుపుబ్బా నవ్విస్తూ, వైసీపీని ఎండగడుతూ ముందుకుసాగుతున్నారు. ఏదేమైనా రోజాకు మాత్రం వేణు అదిరిపోయే పంచ్ పడేశాడు. దీనిపై రోజమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ? చూడాలి.