టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నిఖిల్. స్వామిరారా నుంచి ప్రారంభమైన నిఖిల్ జైత్రయాత్ర మధ్యలో ఒక్క శంకరాభరణం మినహాయిస్తే కొనసాగుతూనే ఉంది. ఈ దూకుడుతోనే నిఖిల్ ఈ శుక్రవారం కేశవగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నిఖిల్ కేరీర్లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
నిఖిల్ సినిమా తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. నైజాంలో 250, సీడెడ్, ఆంధ్రల్లో 400, ఓవర్సీస్లో 170 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. ఇక కేశవ వరల్డ్ వైడ్గా రూ.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది నిఖిల్ కేరీర్లో హయ్యస్ట్ కావడం విశేషం.