ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పండ‌గ చేసుకునే న్యూస్. ప్ర‌స్తుతం జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, కొర‌టాల శివకు క‌మిట్ అయ్యాడు. ఇక రాజ‌మౌళి సైతం ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్‌లో మునిగి తేలుతున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ జోష్ నుంచి ఇంకా తేరుకోక‌ముందే వారికి మ‌రో పండ‌గ చేసుకునే వార్త వ‌చ్చేసింది. ఎన్టీఆర్ హిందీలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన రియాల్టీ షో బిగ్‌బాస్ ను పోలిన రియాలిటీ షోకు వ్యాఖ్య‌త‌గా వ్య‌హ‌రించ‌నున్నాడు. హిందీలో బిగ్‌బాస్ షోను పోలిన ఓ షోను తెలుగులో స్టార్ మా ఛానెల్ రూపొందిస్తోంది.

ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విషయమై ఛానెల్‌ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారట ఎన్టీఆర్‌. ఈ విషయాన్ని సదరు ఛానెల్‌ నిర్వాహకులు సైతం అధికారికంగానే ప్ర‌క‌టించారు. తెలుగులో ఇప్ప‌టికే చిరంజీవి, నాగార్జున బుల్లితెర మీద వ్యాఖ్యాత‌లుగా ఉన్నారు.

మ‌రి ఎన్టీఆర్ ఇప్పుడు ప్ర‌తి రోజు బుల్లితెర మీద క‌నిపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ మామూలుగా ఉండ‌దు. ఎన్టీఆర్ షో ఉన్న‌న్ని రోజులు వారు పండ‌గే చేసుకుంటారు. వెండితెర మీద‌, రాజ‌కీయంగా ఎన్నో సంచ‌నాల‌కు కేంద్ర బిందువు అవుతోన్న ఎన్టీఆర్ బుల్లితెర మీద ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.